ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ల విచారణకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేశారు. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో ఐదుగురు సభ్యులని నియమించారు. అక్టోబర్ ఒకటిన పిటిషన్లపై విచారణ చేపట్టనున్నారు. కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన విషయం తెలిసిందే. దాన్ని సవాల్ చేస్తూ సుప్రీంలో పలు వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి. అయితే అన్ని పిల్స్ను పరిష్కరించేందుకు ఇవాళ సుప్రీంకోర్టు అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసింది.