ఢిల్లీని తాకిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ సెగ

Update: 2021-02-15 09:03 GMT

ఢిల్లీని తాకిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ సెగ

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు, ప్రజాసంఘాలు చేస్తున్న ఆందోళనల సెగ.. దేశ రాజధాని ఢిల్లీని తాకింది. దీంతో హస్తినబాట పట్టారు పలువురు ఏపీ బీజేపీ నేతలు. రెండ్రోజుల పాటు హస్తినలో పర్యటించి, పలువురు కేంద్రమంత్రులు, పార్టీ పెద్దలతో మంతనాలు జరపనున్నారు. ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు, ఎమ్మెల్సీ మాధవ్‌, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో బీజేపీ నేతల బృందం భేటీ కానుంది.

Tags:    

Similar News