Delhi: రేపటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

* పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నేతృత్వంలో అఖిలపక్ష భేటీ * అఖిలపక్ష సమావేశానికి హాజరుకానున్న ప్రధాని మోడీ

Update: 2021-11-28 03:17 GMT

అఖిలపక్ష సమావేశం(ఫైల్ ఫోటో)

Delhi: పార్లమెంటు శీతాకాల సమావేశాలు రేపట్నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష భేటీ జరగనుంది. కాసేపట్లో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి నేతృత్వంలో అఖిలపక్ష భేటీ కానుంది. ప్రధాని మోడీ ఈ భేటీకి హాజరుకానున్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కేంద్రం కోరనుంది. మరోవైపు రేపు లోక్‌సభ ముందుకు సాగు చట్టాల రద్దు బిల్లు రానుంది.

Tags:    

Similar News