మహారాష్ట్ర రాజకీయాల్లో మరో ట్విస్ట్

Update: 2019-11-27 10:40 GMT
అజిత్ పవార్

మహారాష్ట్ర రాజకీయాలు మలుపుల మధ్యనే అడుగులేస్తున్నాయి. పార్టీని ధిక్కరించి బీజేపీతో కలసి థమ్కీ ఇచ్చినా అజిత్ పవార్ కే శరద్ పెద్ద పీట వేస్తున్నారు. అజిత్ పవార్ కు డిప్యూటీ సీఎం పదవి తో పాటూ పార్టీ పగ్గాలు కూడా అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది.

మొదట డిసెంబర్ 1 న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని ఉద్ధవ్ అనుకున్నా గవర్నర్ సూచనతో రేపే ప్రమాణం చేయాలని నిర్ణయించారు. మంత్రివర్గ కూర్పులో శరద్ పవార్, అజిత్ పవార్, సేన, కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారు. మొదట్లో డిప్యూటీ సీఎం పదవి వస్తుందనుకున్న జయంత్ పాటిల్ కు శరద్ పవార్ నచ్చ చెప్పినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News