Delhi: ఢిల్లీ సహా ఉత్తరాదిన పెరిగిన వాయుకాలుష్య తీవ్రత
Delhi: ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 323గా నమోదు
Delhi: ఢిల్లీ సహా ఉత్తరాదిన వాయుకాలుష్య తీవ్రత పెరిగింది. ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 323గా నమోదయ్యింది. బాణసంచాపై నిషేధం అమల్లో ఉన్నప్పటికీ విరివిగా వినియోగించినట్లు తెలుస్తోంది. రాత్రి 8 గంటల తర్వాత పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. ఢిల్లీ వాసులు గురుగ్రాం, నోయిడా నుంచి టపాసులు కొనుగోళ్లు చేశారు. అయితే పొరుగు రాష్ట్రాల్లో బాణసంచాపై నిషేధం లేకపోవడంతో నియంత్రణ కష్టతరమైంది.