పైలట్‌కు కరోనా.. విమానం వెనక్కి

Update: 2020-05-30 11:01 GMT

కరోనా వైరస్ వ్యాపించడంతో మార్చి 23వ తేదీ నుంచి అంతర్జాతీయ విమానాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. విదేశాల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం వందే భారత్‌ మిషన్‌ చేపట్టిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా శనివారం ఢిల్లీ నుంచి రష్యా రాజధాని మాస్కో బయలుదేరిన ఎయిర్‌ ఇండియా విమానాన్ని మార్గమధ్యలోనే వెనక్కి రప్పించారు.

విమానంలోని పైలట్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని విమానయాన సంస్థ గ్రౌండ్‌ సిబ్బంది గుర్తించారని ఎయిర్‌ఇండియా సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఆ విమానం శనివారం అర్ధరాత్రి దిల్లీకి చేరుకుంటుందని తెలిపారు. సిబ్బంది క్వారంటైన్‌లో ఉంటారని, మాస్కోకు మరో విమానాన్ని పంపిస్తామని వెల్లడించారు. 

Tags:    

Similar News