Rahul Gandhi: కేంద్రంపై రాహుల్ మరోసారి తీవ్ర విమర్శలు

Rahul Gandhi: కేంద్రం తీరుతో 97శాతం మంది ఆదాయంలో కోత పడిందని ట్వీట్

Update: 2021-05-31 11:34 GMT

రాహుల్ గాంధీ (ఫైల్ ఇమేజ్)

Rahul Gandhi: కరోనాను ఎదుర్కోవడంలో కేంద్రం విఫలమైందని రాహుల్ గాంధీ మరోసారి ఫైర్ అయ్యారు. కేంద్రం దురహంకారం 97శాతం భారతీయుల ఆదాయంలో తగ్గుదలకు కారణమైందని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ అతలాకుతం కావడానికి కరోనా వైరస్ మ్యూటెంట్లు రెండో కారణమని వ్యాఖ్యానించారు. సెకండ్ వేవ్ కట్టడికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో లాక్‌డౌన్ల అమలుతో 97శాతం భారతీయులు పేదరికంలోకి వెళ్లారని పుర్కొన్న రిపోర్ట్‌ను కూడా రాహుల్ తన ట్వీట్‌కు జోడించారు.


Tags:    

Similar News