Navy Chief: నేవీ చీఫ్ అడ్మిరల్గా దినేష్ కుమార్ బాధ్యతలు
Navy Chief: నేవీ చీఫ్ అడ్మిరల్గా దినేష్ కుమార్ త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు.
Navy Chief: నేవీ చీఫ్ అడ్మిరల్గా దినేష్ కుమార్ త్రిపాఠి బాధ్యతలు స్వీకరించారు. గతంలో నావికాదళ డైరెక్టర్ జనరల్గా, వెస్ట్రన్ నేవల్ కమాండ్కు ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్గా పనిచేశారు. హరి కుమార్ రిటైర్ అయిన తర్వాత 26వ నేవీ చీఫ్గా అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఆయన నియామకంపై ప్రభుత్వం ఏప్రిల్ 19న అధికారిక ప్రకటన చేసింది. హౌతీ తిరుగుబాటుదారులు, సోమాలి సముద్రపు దొంగల నిరంతర దాడులు, అరేబియా సముద్రం, సోమాలియా తూర్పు తీరంలో భారత యుద్ధనౌకలు విస్తృతంగా మోహరించిన సమయంలో త్రిపాఠి నౌకాదళ పగ్గాలు చేపట్టారు.