నోరుజారి మాట్లాడా.. క్షమించండి.. రాష్ట్రపతికి అధిర్ రంజన్‌ చౌదరి లేఖ..

Adhir Ranjan Chowdhury: అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్​ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి సారీ చెప్పారు.

Update: 2022-07-29 14:48 GMT

నోరుజారి మాట్లాడా.. క్షమించండి.. రాష్ట్రపతికి అధిర్ రంజన్‌ చౌదరి లేఖ..

Adhir Ranjan Chowdhury: అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్​ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి సారీ చెప్పారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపత్ని అనడం రాజకీయంగా దుమారం రేపిన నేపథ్యంలో ఈమేరకు ఆయన లేఖ రాశారు. ముర్ము అత్యున్నత పదవి గురించి చెప్పేందుకు పొరపాటున తప్పుడు పదం వాడినందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని అధిర్ పేర్కొన్నారు. నోరు జారడం వల్లే ఇలా జరిగిందన్నారు. తనను క్షమించండి అని అధిర్ కోరారు.

Tags:    

Similar News