భారత్ కరోనాతో మరో వ్యక్తి చనిపోయాడు. కోల్కతాలో 55ఏళ్ల వ్యక్తి కరోనాతో మృతి చెందాడు. బాధితుడు కొద్ది రోజుల క్రితం ఇటలీ నుంచి వచ్చాడు. నాలుగు రోజుల క్రితం కోల్ కతా ఆసుపత్రిలో బాధితుడు చేరాడు. అయితే, ఈ వ్యక్తి కరోనాతోనే మృతి చెందాడనే విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.