Coronavirus Updates: భారత్‌లో కొత్తగా 9,996 కరోనా పాజిటివ్‌ కేసులు

Update: 2020-06-11 04:10 GMT

భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 9,996 కేసులు నమోదు కాగా,357 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలో మొత్తం 2,86,579 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,37,448 ఉండగా, 1,41,028 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 8,102 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 1,51,808. దేశంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా టెస్ట్ ల సంఖ్య 52,13,140.

Tags:    

Similar News