భారత్లో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్లో 8,392 కేసులు నమోదు కాగా, 230 మంది ప్రాణాలు విడిచారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,90,535గా ఉన్నది. మృతుల సంఖ్య 5394కి చేరింది. ఇక 91,818 మంది కోలుకొని ఇళ్లకు చేరగా.. మరో 93,322 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.