దేశంలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు

Corona Cases in India: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

Update: 2022-06-11 04:53 GMT

దేశంలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు

Corona Cases in India: దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రోజువారీ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్న కేసులతో ఫోర్త్ వేవ్ వస్తుందేమోననే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. గత 24 గంటల్లో ఏకంగా 8వేల 329 కొత్త కేసులు నమోదయ్యాయి. ముందు రోజుతో పోలిస్తే కేసుల సంఖ్య దాదాపు 10 శాతం పెరిగింది. అంతకు ముందు రోజు 7వేలకు పైగాకేసులు నమోదయ్యాయి. 24గంటల్లో 4వేల 216 మంది కరోనా నుంచి కోలుకోగా.. 10 మంది మృతి చెందారు. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 40వేల 370కు చేరుకుంది.

Tags:    

Similar News