భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. పలు రాష్ట్రాల్లో రోజురోజుకూ ఈ కేసుల తీవ్రత పెరుగుతోంది. తాజాగా రాజస్థాన్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 12 గంటల వ్యవధిలోనే 64 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,799కు చేరగా వారిలో 97 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జి కాగా, 26 మంది మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. ఇక జిల్లాల వారీగా చూస్తే జైపూర్లో అత్యధికంగా 661 కేసులు, జోధ్పూర్లో 279 కేసులు నమోదయ్యాయని రాజస్థాన్ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.