Coronavirus Updates in India: భారత్‌లో కొత్తగా 47,704 కరోనా పాజిటివ్‌ కేసులు

Update: 2020-07-28 04:36 GMT
ప్రతీకాత్మక చిత్రం

Coronavirus Updates in India: భారత్‌లో‌ కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. భారత్ లో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. వివిధ రాష్ట్రాల నుండి కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కేసుల సంఖ్య 14 లక్షల 83 వేలు దాటింది. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 47,704 కేసులు నమోదు కాగా, 654 మంది ప్రాణాలు విడిచారు. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 35,175 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది.

దేశంలో మొత్తం 14,83,157 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 4,96,988 ఉండగా, 9,52,744 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా 33,425 మంది కరోనా వ్యాధితో మరణించారు. గడచిన 24 గంటలలో దేశంలో నమోదయిన కేసులలో యాక్టివ్ కేసుల శాతం 33.51%. గడచిన 24 గంటలలో దేశంలో నమోదయిన కేసులలో రికవరీ కేసుల శాతం 64.24%. గడచిన 24 గంటలలో దేశంలో నమోదయిన కేసులలో మరణాల శాతం 2.25%. గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 5,28,052 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు దేశంలో 1,73,34,885 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.

Tags:    

Similar News