Corona Cases in India: భారత్‌లో పెరుగుతున్న కరోనా కేసులు

* కొత్తగా 44 వేల 230 మందికి పాజిటివ్ * గడిచిన 24 గంటల్లో 555 మంది మృతి * ప్రస్తుతం దేశంలో 4,05,155 యాక్టివ్ కేసులు

Update: 2021-07-30 05:19 GMT

కరోనా వైరస్ ( Representation Photo )

Corona Cases in India: భారత్‌లో మళ్లీ కోవిడ్ కోరలు చాస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. మూడు రోజులుగా దేశంలో 40 వేలకు పైగా రోజువారీ కేసులు నమోదవుతుండగా కొత్తగా 44 వేల 230 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. గడిచిన 24 గంటల్లో 555 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇక తాజా కేసులతో దేశంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 3 కోట్ల 15 లక్షల 72 వేలు దాటగా ప్రస్తుతం 4 లక్షల 5 వేల యాక్టివ్ కేసులున్నాయి. 

Tags:    

Similar News