Corona Cases in India: భారత్లో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
* ఒక్కరోజులో 14వేలు పెరిగిన కేసుల సంఖ్య * కొత్తగా 43,654 మందికి పాజిటివ్ * గడిచిన 24 గంటల్లో 640 మంది మృతి
కరోనా వైరస్ (Representation Image)
Corona Cases in India: భారత్లో మళ్లీ కరోనా కేసులు పెరిగాయి. నిన్న 30 వేలకు దిగువన నమోదైన రోజువారీ పాజిటివ్ కేసులు 24 గంటల్లో 14వేలు పెరిగాయి. కొత్తగా దేశవ్యాప్తంగా 43 వేల 654 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఇక కోవిడ్ బారిన పడి గడిచిన 24 గంటల్లో 640 మంది మృతి చెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 3 లక్షల 99 వేల 436 యాక్టివ్ కేసులు ఉండగా ఇప్పటివరకు 4 లక్షల 22 వేల మంది మరణించారు.