Delhi News: గోడపై మూత్రం పోశాడని యువకుడి హత్య..
Delhi News: ఢిల్లీలో జరిగిన దారుణ హత్య కలకలం రేపుతోంది.
Delhi News: ఢిల్లీలో జరిగిన దారుణ హత్య కలకలం రేపుతోంది. ఓ ఇంటి గోడపై మూత్రం పోయడం ఈ హత్యకు దారితీసింది. దక్షిణ ఢిల్లీలోని మాలవీయనగర్లో ఓ ఇంటి గోడపై 25 ఏళ్ల మయాంక్ అనే హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్ మూత్రం పోశాడు. ఇది గమనించిన ఆ ఇంటి యజమానురాలు మయాంక్ను మందలించింది. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఆమెను మయాంక్ దుర్భాషలాడటంతో వివాదం పెద్దదైంది. ఈ క్రమంలో ఆమె కొడుకు మనీష్.. మయాంక్ పరస్పరం దాడికి పాల్పడ్డారు. మనీష్కు తోడుగా వచ్చిన అతని స్నేహితులు మయాంక్ను కత్తులతో పొడిచి హత్య చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.