కుల్గాంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

Update: 2020-10-10 02:37 GMT

జమ్మూ కాశ్మీర్ లో మళ్ళీ తుపాకీ తూటా పేలింది. కుల్గాం జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. తాజా సమాచారం ప్రకారం , మరో ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు అక్కడే ఉన్నారని భద్రతా దళాలు భావిస్తున్నాయి. దాంతో ఎన్‌కౌంటర్ ను ఆపలేదు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి భద్రతా దళాలు. కాగా కుల్గాం జిల్లాలోని లోయ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దాంతో భద్రతా దళాలకు సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్నారు.

అనంతరం సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అయితే భద్రతా దళాలు తమను ఎన్‌కౌంటర్ చేస్తాయేమోనని ముందుగానే కాల్పులు ప్రారంభించారు ఉగ్రవాదులు. దాంతో భద్రతా దళాలు కూడా కాల్పులు జరపడంతో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు. మరో ఇద్దరు లేదా ముగ్గురు తప్పించుకున్నారు. ప్రస్తుతం వారికోసం శోధన చేస్తున్నారు. ఇదిలావుంటే ఈ ఏడాది ఎక్కువ మంది ఉగ్రవాదులు భద్రతా దళాల చేతిలో హతమయ్యారు. 

Tags:    

Similar News