ఢిల్లీలో విజృంభిస్తున్న కరోనా

Update: 2020-06-10 03:40 GMT

భారత్‌లో‌‌ కరోనా కేసులు ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. లాక్ డౌన్ సడలింపులతో ఢిల్లీలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ దిశగా కరోనా వైరస్ వ్యాప్తి. ఢిల్లీలో 183 కి చేరిన కంటైన్మెంట్ జోన్ల సంఖ్య. గత 24 గంటల్లో 1,366 కరోనా కేసులు నమోదైనట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం మీద ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 31,309కు పెరిగాయి. గత 24 గంటల్లో 504 మంది డిశ్చార్జ్, 7గురు మరణించారు. ఇప్పటివరకు కరోనాతో 905 మంది చనిపోయారు. ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 18,543. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 11,861 ఉన్నాయి.


Tags:    

Similar News