నిర్భయ కేసులో దోషి వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం చేశాడు. జైలు గదిలో వినయ్ శర్మ తలను గోడకు కొట్టుకున్నట్టు తెలుస్తోంది. దీంతో అతడి తలకు గాయాలయ్యాయి. వెంటనే జైలు అధికారులు వినయ్ శర్మను ఆసుపత్రికి తరలించారు. ఉరి శిక్ష నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో ఇలా చేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిర్భయ దోషుల ఉరితీతకు మరోసారి డెత్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో ఉరిని వాయిదా పడేలా పలు మార్గాలను వీరు అన్వేషిస్తున్నారు. దోషులు ఇప్పటివరకు తమ ముందున్న న్యాయ అవకాశాలను ఉపయోగించుకోవాలని చూశారు. ఇప్పుడు ఇలా చేస్తున్నారని అధికారులు భావిస్తున్నారు.