Vijayendra Prasad: బయోపిక్ కోసం కథ రాస్తున్న విజయేంద్రప్రసాద్

Vijayendra Prasad: త్వరలో బయోపిక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విజయేంద్రప్రసాద్

Update: 2022-04-11 10:00 GMT

Vijayendra Prasad: బయోపిక్ కోసం కథ రాస్తున్న విజయేంద్రప్రసాద్

Vijayendra Prasad: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ రైటర్ లలో విజయేంద్రప్రసాద్ కూడా ఒకరు. దాదాపు రాజమౌళి దర్శకత్వం వహించిన సినిమాలు అన్నిటికీ కథ ను అందించింది విజయేంద్ర ప్రసాద్. అయితే తాజా సమాచారం ప్రకారం విజయేంద్రప్రసాద్ ఇప్పుడు ఒక బయోపిక్ సినిమా కోసం కథను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ బయోపిక్ మరెవరిదో కాదు బంకించంద్ర చటర్జీ మీద.

మన దేశ గీతం వందేమాతరం రచించిన బంకించంద్ర చటర్జీ చనిపోయి 128 ఏళ్ళు పూర్తికాగా ప్రముఖ ఫిలింమేకర్ రామ్ కమల్ ముఖర్జీ మరియు జి స్టూడియోస్ మాజీ హెడ్ సుజయ్ కుట్టి కలిసి "1770: ఎక్ సంగ్రాం" అనే టైటిల్ తో బంకించంద్ర చటర్జీ జీవిత కథ ఆధారంగా ఒక సినిమాని ప్రకటించారు. నిన్నమొన్నటిదాకా ఇలాంటి కథని ప్రేక్షకులు పెద్దగా చూడరని అనుకున్ననని అన్నారు ప్రసాద్. తాజాగా చిత్ర డైరెక్టర్ రామ్ కమల్ స్క్రిప్ట్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

రామ్ కమల్ ఈ సినిమా కోసం ఒక కమర్షియల్ సబ్జెక్టుతో వచ్చారని ఇందులో అన్ని రకాల హ్యూమన్ ఎమోషన్స్ నిండి ఉంటాయని అన్నారు విజయేంద్ర ప్రసాద్. ఇది రామ్ కమల్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఇలాంటి ప్రాజెక్ట్ కోసం తాను కూడా చేతులు కలపడం తనకు చాలా సంతోషంగా ఉన్నట్లు తెలిపారు విజయేంద్రప్రసాద్. ఈ సినిమా షూటింగ్ మరికొద్ది నెలల్లో సెట్స్ పైకి వెళ్లనుంది. చాలా వరకు ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్, లండన్ మరియు వెస్ట్ బెంగాల్ లలో జరగబోతున్న ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News