హీరోయిన్ రకుల్ ప్రీత్ కు కరోనా పాజిటివ్!

మరో టాలీవుడ్ హీరోయిన్ కరోనాకు చిక్కారు

Update: 2020-12-22 10:32 GMT

టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన రకుల్ ప్రీత్ సింగ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె సవ్యంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈరోజు (మంగళవారం) రకుల్ తన ట్విట్టర్ లో తాను కరోనా సోకినా విషయాన్ని తెలిపారు. తనకు కరోనా సోకిందని.. అయితే తానూ ఆరోగ్యంగా ఉన్నాననీ ఆమె చెప్పారు. తనతో ఇటీవల కల్సిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆ ట్వీట్ లో ఆమె కోరనారు. 

ఇంతకు ముందు టాలీవుడ్ హీరోయిన్ తమన్నా కూడా కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. ఇక రకుల్ ఇప్పుడు వైష్ణవ తేజ్ హీరోగా వస్తున్నా తాజా చిత్రంలో నటిస్తున్నారు. 

Tags:    

Similar News