ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ భారత్లోను కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలను ఎక్కువగా టెన్షన్ పెడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఈ ప్రాణాంతక వైరస్ను అదుపు చేసేందుకు అన్ని దేశాలు నడుం బిగించాయి. ముఖ్యంగా ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుండి కాపాడుకోవచ్చు అని చెబుతున్నారు. కరోనా బారిన పడకుండా ముందస్తు జాగ్రత్త కోసం ప్రజలు మాస్క్లను వాడుతున్నారు.
ఈ క్రమంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముఖానికి మాస్క్ ధరించి విదేశాలకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమాలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఫ్రాన్స్లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు ప్రభాస్ చేరుకున్నారు. ఆయన మాస్క్ వేసుకుని ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్తున్నప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.