YS Jagan - Chiranjeevi: ఏపీ సీఎం జగన్‌ను కలవనున్న టాలీవుడ్ పెద్దలు

YS Jagan - Chiranjeevi: * మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో సెప్టెంబర్ 4న భేటీ * ఏపీలో ఇండస్ట్రీ అభివృద్ధిపై చర్చ

Update: 2021-08-29 05:35 GMT

ఏపీ సీఎం జగన్‌ను కలవనున్న టాలీవుడ్ పెద్దలు

YS Jagan - Chiranjeevi: టాలీవుడ్ సమస్యల పరిష్కారానికై మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సిని పెద్దలు ఏపీ సీఎం జగన్‌ను కలవనున్నారు. సెప్టెంబర్ 4న చిరంజీవి, టాలీవుడ్ పెద్దలు భేటీ కానున్నారు. టిక్కెట్లు రేటు, ఆక్యూపెన్సీ, విద్యుత్ బకాయిల మాఫీ, ఏపీలో ఇండస్ట్రీ అభివృద్ధి తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కరోనా వేవ్ తగ్గుముఖం పట్టడంతో థియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు సిద్ధమైనా ఏపీలో టిక్కెట్ల ధర సమస్యాత్మకం అయింది. సవరించిన ధరలతో ఎగ్జిబిషన్, పంపిణీ రంగాలు చిక్కుల్లో పడ్డాయి. థియేటర్ల సమస్య చాలాకాలంగా ఓ కొలిక్కిరాలేదు. ఈ సమావేశం తరువాతైన ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News