ఎన్టీఆర్‌ ఘాట్‌కు వెళ్లకూడదని ఎన్టీఆర్‌, కల్యాణ్‌రామ్ నిర్ణయం..

Update: 2020-05-27 09:12 GMT

నందమూరి తారకరామారావు జయంతి(మే 28) సందర్భంగా ప్రతి ఏడాది కుటుంబసభ్యులు, అభిమానులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు నివాళులర్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడానికి కుదరడం లేదు. ఈ నేపథ్యంలో గురువారం ఎన్టీయార్ ఘాట్ వద్ద కాకుండా ఇంటి దగ్గరే ఎన్టీయార్‌కు నివాళులర్పించాలని జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నిర్ణయించుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ , కల్యాణ్ రామ్ లు గురువారం ఎన్టీఆర్ ఘాట్‌కు రావడం లేదని నిర్మాత, ఎన్టీఆర్ కు పీఆర్వోగా వ్యవహరిస్తున్న మహేష్ కోనేరు ట్విట్టర్ ద్వారా తెలిపారు. 



 


Tags:    

Similar News