రాజకీయం వేరు, సినిమా వేరు.. సీఎం కేసీఆర్కి నా మీద కోపం లేదు : బాలకృష్ణ
సినీ పెద్దలు ముఖ్యమంత్రులతో పలు దఫాలుగా చర్చలు జరిపి షూటింగ్లు ప్రారంభం కావడానికి కృషిచేస్తున్నారు.
సినీ పెద్దలు ముఖ్యమంత్రులతో పలు దఫాలుగా చర్చలు జరిపి షూటింగ్లు ప్రారంభం కావడానికి కృషిచేస్తున్నారు. త్వరలోనే ఏపీ సీఎం జగన్ను కూడా కలవబోతున్నట్లు చిరంజీవి ట్వీట్ లో తెలిపారు. ఈ నేపథ్యంలో సినీ పెద్దలతో ప్రభుత్వం జరుపుతున్న చర్చల గురించి తనకు తెలియని నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపుతున్నాయి. చిత్రీకరణ అంశాలపై ప్రభుత్వంతో సినీ పెద్దలు జరుపుతున్న చర్చల విషయం తనకు పేపర్లో వచ్చే వార్తల ద్వారా మాత్రమే తెలిసిందని అన్నారు. ఈ సందర్భంగా ఇండస్ట్రీ కోసం జరుగుతున్న చర్చలను భూములు పంచుకుంటున్నారా? అంటూ బాలయ్యా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
బాలయ్య చేసిన వ్యాఖ్యలను నిర్మాత సి కళ్యాణ్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ( మా) అధ్యక్షుడు నరేష్ ఖండించారు. మెగా బ్రదర్ నాగబాబు బాలయ్య నోరు అదుపులో పెట్టుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలకృష్ణ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. గతంలో ఎన్నికల సమయంలో బాలకృష్ణ కేసీఆర్పై మీరు కొన్ని విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయమై యాంకర్ అడిగిన ప్రశ్నకు బాలయ్య సమాధానం ఇచ్చారు.
'ముఖ్యమంత్రి కేసీఆర్ను కలవడానికి ఇండస్ట్రీలోని వాళ్లంతా వెళ్లినప్పుడు నన్నెందుకు పిలవలేదో నాకు తెలియదని, కేసీఆర్గారికి నా మీద ఎప్పుడూ కూడా కోపం లేదు. రాజకీయ కోణంలో ఆయనపై చేసిన విమర్శల కారణంగా పిలవకపోతే ఆ విషయం నాకు చెప్పాల్సింది. రాజకీయం వేరు.. సినిమా వేరు. రామారావుగారి అభిమానిగా నేనంటే కేసీఆర్ గారికి పుత్ర వాత్సల్యం ఉంది. మిగిలిన వాటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు'' అని బాలకృష్ణ చెప్పుకొచ్చారు. తనను వేరేగా చూస్తే ఎలా అని ప్రశ్నించారు.
HMTV లైవ్ వార్తలు ఎప్పటికప్పుడు గూగుల్ న్యూస్ లో చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి