టాలీవుడ్ల్లో విషాదం.. ప్రముఖ నటుడు కన్నుమూత
తెలుగు సినీపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. సీనియర్ నటుడు జనార్దన్రావు తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో అనారోగ్యంతో కన్నుమూశారు.
తెలుగు సినీపరిశ్రమలో విషాదఛాయలు అలుముకున్నాయి. సీనియర్ నటుడు జనార్దన్రావు తుదిశ్వాస విడిచారు. శుక్రవారం ఉదయం చెన్నైలోని ఆయన నివాసంలో అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మృతిపట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. సౌత్ ఇండియాన్ ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్లో జాయింట్ సెక్రటరీగానూ.., కమిటీ సభ్యుడిగా వ్యవహరించారు.
కాగా.. గుంటూరు జిల్లాలోని పొనిగళ్ల గ్రామం జనార్ధన్రావు స్వస్థలం. వెయ్యికిపైగా తెలుగు చిత్రాలతోపాటు, పలు సిరీయల్స్లో నటించారు. 'జానకిరాముడు', 'మజ్ను', పెదరాయుడు', 'కొండవీటి సింహం', 'అభిలాష', 'అమ్మోరు', 'గోరింటాకు' వంటి చిత్రాల్లో వివిధ పాత్రల్లో ఆయన కనిపించారు. జనార్దన్రావు జూ. ఎన్టీఆర్ 'జనతాగ్యారేజ్' సినిమాలో చివరిగా కనిపించారు. 'గోకులంలో సీత', 'తలంబ్రాలు' వంటి టీవీ సిరీయల్స్లో నటించారు.