నేడు జగన్‌తో సినీ ప్రముఖుల భేటీ.. కరోన కారణంగా 7గురు మాత్రమే రావాలని..

Update: 2020-06-09 04:29 GMT

ఈరోజు సాయంత్రం 3గంటలకు సీఎం జగన్ మోహన్ రెడ్డిని కలవనున్న టాలీవుడ్ ప్రముఖుల బృందం. చిరంజీవి నేతృత్వంలో సీఎం జగన్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్న 7గురు టాలీవుడ్ ప్రముఖులు. బృదంలో అగ్ర హీరోలైన నాగార్జున, చిరంజీవితో పాటు దర్శకులు, రాజమౌళి, నిర్మాతలు దామోదర్ ప్రసాద్, సి కళ్యాణ్, సురేష్ బాబు, దిల్ రాజు. నంది అవార్డులు ప్రోత్సహించడం, ఎంటర్టైన్మెంట్ టాక్సులు మినహాయింపు, స్టూడియోలు నిర్మించడానికి అవసరమైన భూములపై రాయితీలు లాంటి అంశాలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లనున్న టాలీవుడ్ ప్రముఖుల బృందం. ఏపీలో చిత్ర నిర్మాణాలకు ప్రోత్సాహకాలు కొన్ని ప్రత్యేక అనుమతులు, చిత్ర నిర్మణాల రాయితిలపై కూడా చర్చించనున్న బృందం. మొదట 25మందితో కలవాల్సి ఉన్నప్పటికీ కరోన కారణంగా 7గురు మాత్రమే రావాలని కోరిన సీఎంవో కార్యాలయం.

Tags:    

Similar News