Producer Swaminathan Passed Away : కరోనాతో ప్రముఖ నిర్మాత స్వామినాథన్ మృతి

Producer Swaminathan Passed Away : కరోనా ఎవరిని వదలడం లేదు...సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి కరోనా సోకుతుంది.. దీనితో ప్రజలు

Update: 2020-08-11 05:27 GMT
Representational Image

Producer Swaminathan Passed Away : కరోనా ఎవరిని వదలడం లేదు...సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరికి కరోనా సోకుతుంది.. దీనితో ప్రజలు మరింత భయాందోళనలకి గురి అవుతున్నారు..ఇక సినిమా పరిశ్రమ పైన కరోనా ప్రభావం ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఇప్పటికే చాలా మంది సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. ఇందులో కొందరు కోలుకోగా మరికొందరు మృతి చెందారు. తాజాగా కరోనాతో పోరాడి కోలీవుడ్ నిర్మాత, నటుడు వీ. స్వామినాథన్(62) మృతి చెందారు.. అయన మృతితో కోలివుడ్ లో విషాద ఛాయలు నెలకొన్నాయి..

గత కొన్నిరోజులుగా అయన కరోనా వైరస్‌తో బాధపడుతున్నారు..చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అయన ఈ రోజు (ఆగస్టు 11)న అయన మరణించారు... లక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ ని కే మురళీధరన్, వేణుగోపాల్ వంటి నిర్మాతలతో కలిసి స్థాపించారు స్వామినాథన్‌.. దాదాపుగా రెండు దశాబ్ధాలకు పైగా చిత్రసీమకి ఆయన సేవలను అందించారు.. మొదటిసారిగా అయన 1994లో అరణ్‌ మనై కావలన్‌ అనే చిత్రాన్ని నిర్మించారు.. ఇక అజిత్, విజయ్, కమల్ హాసన్, సూర్య, కార్తిక్‌ వంటి స్టార్ హీరోలతో అయన సినిమాలను నిర్మించారు..

ఇక స్వామినాథన్ మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.. మంచి మిత్రుడిని కోల్పోయామంటూ తమ ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు.. ఇక స్వామినాథన్ కుమారుడు అశ్విన్‌ కూడా సినీ ఇండస్ట్రీలోనే ఉన్నారు.. అయన నటుడుగా కోలివుడ్ లో స్థిరపడిపోయారు.


Tags:    

Similar News