బిగ్‌బాస్‌ షోపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌ రియాలిటీ షోపై తెలుగు హీరోయిన్ తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షోలో హింస, గొడవలు పెరిపోయాయని వ్యా‌ఖ్యానించారు.

Update: 2020-02-06 11:07 GMT
బిగ్‌బాస్‌ షోపై తాప్సీ సంచలన వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌ రియాలిటీ షోపై తెలుగు హీరోయిన్ తాప్సీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బిగ్ బాస్ షోలో హింస, గొడవలు పెరిపోయాయని వ్యా‌ఖ్యానించారు. 'థప్పడ్‌' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్యూలో బిగ్‌బాస్‌ షోపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు బిగ్‌బాస్‌ షోలో కుటుంబంతో కలిసి చూసేలా ఉంటుందని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. బిగ్‌బాస్‌ షోలో హింస పెరిగిపోతుందిని, ఒకరిని ఒకరు తీవ్రంగా దూషించుకుంటూ, గొడవలు పెట్టుకుంటూ హింసలు సృష్టిస్తున్నారని ఆమె అన్నారు.

కుటుంబంతో కలిసి షో ఎవరూ చూడలేరని, హింసాత్మకమైన షోలను చూస్తూ ఎలా ఆనందం వ్యక్తం చేయగలరని పేర్కొన్నారు. హింసను టీవీలో చూసూ ఎంజాయ్‌ చేస్తున్న వీక్షకులు తమ ఇంట్లో హింస జరిగితే ఎంజాయ్ చేస్తారా అని తాప్సీ ప్రశ్నించారు. ఒప్పుడు బిగ్‌బాస్‌ షో ఎంతో ఆసక్తికరంగా ఉండేదని ఆమె తెలిపారు.

తెలుగులో సినీ పరిశ్రమకు పరిచయమైన తాప్సీ కొన్ని సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు. దీంతో ఇటీవలే గేమ్ ఓవర్ అనే చిత్రాన్ని తెలుగులో కూడా అనువాదం చేశారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ కు మకాం మార్చారు. అక్కడ తాప్సీ నటించిన చిత్రాలు వరసగా విజయలు సాధించడంతో అగ్రకథానాయిక జాబితాలో చేరిపోయారు. బాలీవుడ్ లో ఆమె ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. తాజా చిత్రం 'థప్పడ్‌' ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. 'థప్పడ్‌'లో చిత్రంలో తాప్సీ గృహిణిగా ఆనందకరమైన జీవితం గడుపుతారు. ఈ తరుణంలో ఆమె భర్త ఆమెను అవమానిస్తూ అందరి ముందు కొడతాడు. దీంతో ఆత్మగౌరవం దెబ్బతింటుంది అక్కడి నుంచి చిత్రం మలుపు తిరుగుతుంది. భర్త చేత క్షమాపణ చెప్పిండానికి చట్టప్రకారం ఏలా ఆమె పోరాటం చేస్తుందనేది ఈ కథ.

ఫిబ్రవరి 28న కాగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. 'థప్పడ్‌' సినిమాకు అనుభవ్‌ సింగ్ దర్శకుడు‌. అనురాగ్ సంగీతం సమకూర్చాడు. టీ సిరీస్, బెనరస్ మీడియా సంయూక్తంగా నిర్మిస్తు్న్నాయి. భూషన్ కుమార్, కిషన్ కుమార్, అనుభవ్‌ సింగ్ నిర్మిస్తున్నారు.  

Tags:    

Similar News