సైరా తో సాహో.. పక్కనే రామ్!

Update: 2019-08-21 04:12 GMT

ఒకరు మెగా స్టార్.. మరొకరు యంగ్ రెబల్ స్టార్, ఇంకొకరు మెగా పవర్ స్టార్! ఈ ముగ్గురూ ఒక దగ్గర కలిస్తే.. ఆ ఫోటో అభిమానులకు కనిపిస్తే.. ఇంకేముంది వైరల్ కావడమే. ప్రస్తుతం అదేజరుగుతోంది.

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా మూవీ టీజర్ ముంబాయిలో విడుదల చేశారు. దానికి నిర్మాత రామ్ చరణ్. ఇక సాహో సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసి ఇప్పుడు ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయారు ప్రభాస్. దానికోసమే ఆయనా ముంబాయిలోనే ఉన్నారు. దీంతో ఈ ముగ్గురు ఒక దగ్గర కలిసి మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురూ కలిసి ఉన్న ఫోటోను క్లిక్ మనిపించారు. ఆ ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ చక్కర్లు కొడుతోంది. మెగాస్టార్ కుటుంబానికి, రెబల్ స్టార్ కుటుంబానికి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. చిరంజీవి తో కృష్ణంరాజు సఖ్యతగా ఉంటారు. వ్యక్తిగతంగా చిరంజీవిని అయన ఇష్టపడతారు. అందుకే ప్రజారాజ్యం పార్టీలో ఆయనా చేరారు. ఇక అదే రకమైన సఖ్యత రామ్ చరణ్, ప్రభాస్ మధ్య కూడా ఉంది. ఇద్దరూ మంచి స్నేహితులుగా చెప్పుకుంటారు. సాహో సినిమా విషయంలో రామ్ చరణ్ సహకరించారని కూడా టాక్ నడుస్తోంది.

ఇప్పడు వీరు ముగ్గురు కలసిన సంఘటన అభిమానులకు ఆనందాన్ని ఇస్తోంది. ఆ ఫోటోను విపరీతంగా షేర్ చేస్తున్నారు.


Tags:    

Similar News