భయపడకండి.. అసత్యవార్తలను ప్రచారం చేయకండి : శివాత్మిక

Update: 2020-10-22 06:12 GMT

సినీ నటుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తన నాన్న పరిస్థితి ఇబ్బందికరంగా ఉందంటూ రాజశేఖర్‌ కూతురు శివాత్మిక ట్వీట్‌ చేశారు. కరోనాతో పోరాటం చేయడంలో నాన్న ఇబ్బందులు పడుతున్నారంటూ శివాత్మిక ట్వీట్ చేశారు. అందరి అభిమానంతో నాన్న క్షేమంగా తిరిగివస్తారని ఆశిస్తున్నాననని ఆమె ట్విట్టర్‌లో వెల్లడించారు.

రాజశేఖర్‌తో పాటు ఆయన భార్యాపిల్లలు కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం తాము కరోనాకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నామని, ఇద్దరు పిల్లలు ఇప్పటికే కరోనా నుంచి బయటపడ్డారని రాజశేఖర్ ఇటీవల తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆయన కూతురు శివాత్మిక రాజశేఖర్ ట్వీట్ చేసింది.

కరోనాపై నాన్న చేస్తోన్న పోరాటం క్లిష్టంగా ఉంది అయినప్పటికీ ఆయన బాగా పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమే తమల్ని కాపాడుతాయని ట్వీట్ చేశారు. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని కోరుతున్నానన్నారు. ఆయన పూర్తిగా కోలుకుని తిరిగి వస్తారని ఆమె ట్వీట్ చేసింది.

అయితే, కాసేపటి తర్వాత శివాత్మిక మరో ట్వీట్ చేయడం గమనార్హం. మీ ప్రేమ ప్రార్థనల పట్ల కేవలం కృతజ్ఞతలు చెబితే సరిపోదని.. ఓ విషయం తెలుసుకోండి.. ఆయన పరిస్థితి విషమంగా లేదని ట్వీట్ చేసిందామె. ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని కోలుకుంటున్నారని ట్విట్టర్‌‌లో వెల్లడించింది. అభిమానుల ప్రార్థనలు కావాలి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నా భయపడకండి అసత్యవార్తలను ప్రచారం చేయకండని ఆమె చెప్పింది.



 

Tags:    

Similar News