హాలీవుడ్‌లో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చిన సెన్సేషనల్ డైరెక్టర్ సత్యా రెడ్డి.. టెక్సాస్‌లో 'కింగ్ బుద్ధ' మూవీ పోస్టర్ లాంచ్

కెడర్ పార్క్, టెక్సాస్, అమెరికా: అక్టోబర్ 4, 2025 – ప్రపంచ శాంతి సందేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో హాలీవుడ్‌లో డైరెక్ట్‌గా నిర్మిస్తున్న 'కింగ్ బుద్ధ' సినిమా పోస్టర్ లాంచ్ ఈవెంట్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గ్రాండ్‌గా జరిగింది.

Update: 2025-10-05 01:23 GMT

కెడర్ పార్క్, టెక్సాస్, అమెరికా: అక్టోబర్ 4, 2025 – ప్రపంచ శాంతి సందేశాన్ని అంతర్జాతీయ స్థాయిలో వ్యాప్తి చేయాలనే లక్ష్యంతో హాలీవుడ్‌లో డైరెక్ట్‌గా నిర్మిస్తున్న 'కింగ్ బుద్ధ' సినిమా పోస్టర్ లాంచ్ ఈవెంట్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో గ్రాండ్‌గా జరిగింది. మూవీ ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ సత్యారెడ్డి అభిమానులు, చిత్ర యూనిట్ సభ్యులు, ప్రముఖుల సమక్షంలో ఈ కార్యక్రమం ఆకట్టుకుంది.

ఈ ఈవెంట్‌కు మూడుసార్లు కెడర్ పార్క్ మేయర్‌గా పనిచేసిన మ్యాట్ పోవెల్ చీఫ్ గెస్ట్‌గా హాజరై, 'కింగ్ బుద్ధ' పోస్టర్‌ను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మ్యాట్ పోవెల్, "గౌతమ బుద్ధుడు ప్రపంచ శాంతి కోసం అమితమైన కృషి చేశారు. ఒక టాలీవుడ్ డైరెక్టర్ మరియు నా స్నేహితుడైన సత్యారెడ్డి ఈ సినిమాను టాలీవుడ్ లేదా బాలీవుడ్‌లో తీసి హాలీవుడ్‌లో డబ్బింగ్ చేయకుండా, డైరెక్ట్‌గా హాలీవుడ్‌లోనే నిర్మించడం చాలా సంతోషకరం. తెలుగు సంతతికి చెందిన వ్యక్తిగా భారీ బడ్జెట్‌తో హాలీవుడ్‌లో సినిమా తీస్తున్న సత్యారెడ్డి చరిత్రలో నిలిచిపోతారు" అని పేర్కొన్నారు. అలాగే, చిత్ర నిర్మాణానికి తమ సహాయ సహకారాలు అందిస్తామని, అవసరమైతే షూటింగ్ కోసం తమ బంగ్లాలు, ప్రాపర్టీలను ఉపయోగించుకోవచ్చని ఆయన అన్నారు.

చిత్ర నిర్మాతల్లో ఒకరైన శైలర్ మాట్లాడుతూ, "ప్రపంచ శాంతి కోసం హాలీవుడ్‌లో డైరెక్టర్ సత్యారెడ్డి నిర్మించే 'కింగ్ బుద్ధ' సినిమాకు అన్‌లిమిటెడ్ బడ్జెట్‌తో, ఎక్కడా కాంప్రమైజ్ చేయకుండా అన్ని హై-లెవెల్ టెక్నికల్ అసెట్స్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తాము" అని తెలిపారు. గతంలో సత్యారెడ్డి డైరెక్షన్‌లో 'ఉక్కు సత్యాగ్రహం' సినిమాలో గద్దర్ గారు నటించిన అనేక సన్నివేశాల్లో బుద్ధిజీవి శాంతి ప్రవచనాలు చూసి ఆకర్షితులైనట్లు ఆయన పేర్కొన్నారు. "ఆ సినిమాను చూసినప్పుడే సత్యారెడ్డి డైరెక్షన్‌లో ప్రపంచ శాంతి కోసం అంతర్జాతీయ స్థాయిలో 'కింగ్ బుద్ధ'ను పూర్తిస్థాయిలో హాలీవుడ్‌లో నిర్మించాలని నిర్ణయించుకున్నాము. డైరెక్టర్ సత్యారెడ్డి చెప్పిన స్టోరీతో ఇప్పుడు ఆ కల నెరవేరబోతోంది" అని శైలర్ అన్నారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ సత్యారెడ్డి మాట్లాడుతూ, "నటుడుగా, నిర్మాతగా, దర్శకుడుగా, రచయితగా, గాయకుడుగా 30 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న నేను, ప్రపంచ శాంతి కోసం 'కింగ్ బుద్ధ' కాన్సెప్ట్‌ను నా నిర్మాతలకు చెప్పగానే వారు భారీ బడ్జెట్‌తో హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులతో ఈ చిత్రాన్ని నిర్మించడానికి అంగీకరించి, పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు" అని తెలిపారు. ఈ పోస్టర్ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్మాతలతో పాటు, అమెరికాలోని అనేక రాష్ట్రాల నుంచి విచ్చేసిన అభిమానులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు. "అతి త్వరలో ప్రపంచంలోని ప్రముఖ బౌద్ధమత పెద్దలు, గురువులు, మంక్స్‌లు, బౌద్ధమతం పై రీసెర్చ్ చేసిన ప్రొఫెసర్లు, బౌద్ధమత అన్వేషకుల సమక్షంలో ఇండియాలోని ఒక ప్రముఖ బౌద్ధారామంలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తాము" అని సత్యారెడ్డి ప్రకటించారు.

సత్యారెడ్డి ఇప్పటివరకు 'సర్దార్ చిన్నపరెడ్డి', 'ప్రత్యూష', 'అయ్యప్పదీక్ష', 'రంగులకల', 'కుర్ర కారు', 'ప్రేమికులరోజు' (హీరో కునాల్‌తో), 'టినగర్', 'సిద్ధం', మెగాస్టార్ చిరంజీవితో 'శంకర్ దాదా జిందాబాద్' చేసిన హీరోయిన్ కరిష్మా కోటక్‌తో 'గ్లామర్', 'ప్రశ్నిస్తా', 'ప్రజా యుద్ధ నౌక', గద్దర్ అన్నతో 'ఉక్కు సత్యాగ్రహం' వంటి శతదినోత్సవ చిత్రాలు నిర్మించారు. ఫిల్మ్ చాంబర్ ప్రొడ్యూసర్స్ సెక్టార్ చైర్మన్‌గా, ప్రజా సమస్యల కోసం తెలుగు సేన పార్టీ అధ్యక్షుడిగా అంతర్జాతీయ స్థాయిలో పని చేసిన సత్యారెడ్డి, ఫస్ట్ టైమ్ హాలీవుడ్‌లో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇవ్వడంతో భారీ సంఖ్యలో అభిమానులు, శ్రేయోభిలాషులు, పారిశ్రామికవేత్తలు హాజరై అభినందాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సోషల్ వర్కర్స్, పారిశ్రామికవేత్తలు పుల్లారెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, రవికుమార్ రెడ్డి, ప్రవర్ధన్, సాయి గణేష్ రెడ్డి, శివ జోష్నా రెడ్డి తో పాటు అనేక మంది ఎన్నారైలు, ప్రముఖులు పాల్గొన్నారు.

Tags:    

Similar News