సాయితేజ్ సంబరాల రిలీజ్ పై సస్పెన్స్ – ఎప్పుడు వస్తుంది?

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘సంబరాలు’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నా, టీమ్ మాత్రం ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వకుండా సైలెంట్‌గా ఉంది. మొదట ప్రకటించిన ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సి ఉంది.

Update: 2025-07-20 15:19 GMT

సాయితేజ్ సంబరాల రిలీజ్ పై సస్పెన్స్ – ఎప్పుడు వస్తుంది?

సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ‘సంబరాలు’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నా, టీమ్ మాత్రం ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వకుండా సైలెంట్‌గా ఉంది. మొదట ప్రకటించిన ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కావాల్సి ఉంది. అయితే అదే రోజున పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ రిలీజ్ అవుతున్నందున, మేనమామతో పోటీకి దిగే ఆలోచన టీమ్‌కు లేదు. ఒకవేళ ‘అఖండ 2’ మాత్రమే ఉంటే రిస్క్ చేసేదామని అనుకున్నా, ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా లేదు.

తదుపరి ఆప్షన్స్ ఏమిటి?

ప్రస్తుతం అక్టోబర్ పై టీమ్ దృష్టి పెట్టింది. కానీ ఆ నెలలో కూడా సమస్యలే.

అక్టోబర్ మొదటి వారం – కాంతార చాప్టర్ 1, ఇడ్లీ కడాయ్ రిలీజ్ అవుతున్నాయి.

మూడో వారం – సిద్ధు జొన్నలగడ్డ ‘తెలుసు కదా’, కిరణ్ అబ్బవరం ‘ర్యాంప్ బిజినెస్’ బిజీగా ఉన్నాయి.

వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న విశ్వంభర కూడా అదే నెలలో రాబోతుందని టాక్.

ఈ పరిస్థితుల్లో అక్టోబర్ కూడా సాయితేజ్‌కు కష్టమయ్యేలా ఉంది.

నవంబర్, డిసెంబర్ కూడా బిజీగా..

నవంబర్ డ్రై సీజన్ కావడంతో వంద కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ పీరియాడిక్ డ్రామాకు అది సరైన సమయం కాదని ఫిల్మ్ సర్కిల్స్ భావిస్తున్నాయి.

డిసెంబర్ విషయానికొస్తే:

ప్రభాస్ – ‘రాజా సాబ్’,

రణ్వీర్ సింగ్ – ‘దురంధర్’ (డిసెంబర్ 5),

అడవి శేష్ – ‘డెకాయిట్’ (క్రిస్మస్) స్లాట్స్ బుక్ చేసేశారు.

ఒకవేళ అఖండ 2, ఓజీ, విశ్వంభర లాంటి సినిమాల్లో ఏదైనా వాయిదా పడితేనే డిసెంబర్‌లో స్లాట్ దొరకే అవకాశం ఉంది. లేకపోతే ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాతే రిలీజ్ అవ్వాల్సి వస్తుంది.

కె.పి. రోహిత్ దర్శకత్వం వహిస్తున్న ఈ పీరియాడిక్ డ్రామాలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటిస్తోంది. సాయితేజ్, సంబరాల రిలీజ్ పై తీసుకోబోయే నిర్ణయం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News