Raashii Khanna: తన సొంత వాయిస్‌ను వినిపించేందుకు రెడీ అంటోన్న రాశీ ఖన్నా

Raashii Khanna: రాశి ఖన్నా, నాగచైతన్య జోడీ "థాంక్స్ యూ" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Update: 2021-04-30 13:06 GMT

రాశీ ఖన్నా (ఫొటో ట్విట్టర్)

Raashii Khanna: రాశీ ఖన్నా, నాగచైతన్య జోడీ "థాంక్స్ యూ" సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను విక్రమ్ కుమార్ దర్శకత్వం చేస్తున్నాడు.

అయితే ఈ సినిమాలో సింక్-సౌండ్ టెక్నాలజీని వాడనున్నట్లు తెలుస్తోంది. ఈ టెక్నాలజీతో ఈ హీరోయిన్ మొదటి సారి పనిచేస్తుంది.

ఈ టెక్నాలజీతో షూటింగ్ సమయంలోనే మాటలను రికార్డ్ చేస్తారంట. దీంతో విడిగా డబ్బింగ్ చెప్పాల్సిన పని ఉండదు.

"ఈ టెక్నిక్‌తో చిత్రీకరించబడే తెలుగు చిత్రం షూటింగ్‌లో నేను ఇదే మొదటిసారి పనిచేస్తున్నాను. ఆడియెన్స్ నా నిజమైన గొంతును వినాలనుకుంటున్నారు. డబ్ చేసిన వాయిస్‌ను కాదు. ఇలాంటి సెటప్‌లో షూటింగ్ చేయడం అంత సులభం కాదు. నేను చాలా సంతోషంగా ఉన్నాను" అని రాశీ అన్నారు.

రాశీ రాబోయే ప్రాజెక్టులలో "తుగ్లక్ దర్బార్", "అరన్మానై 3", "మేథావి", "బ్రహ్మం" ఉన్నాయి. అలాగే రాజ్ , డీకే దర్శకత్వం వహించిన తన తొలి డిజిటల్ తొలి ప్రదర్శన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. దీనిలో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి తో కలిసి రాశిఖన్నా నటించింది.

Tags:    

Similar News