Madhapur DCP: ఎక్కువ స్పీడ్‌తో సాయిధరమ్ తేజ్ డ్రైవ్ చేశాడు

* ఓవర్ స్పీడ్, ఇసుక ఉండటంతో ప్రమాదం- మాదాపూర్ డీసీపీ * రాయదుర్గం పీఎస్‌లో సాయిధరమ్ తేజ్‌పై కేసు

Update: 2021-09-11 09:30 GMT

సాయి ధరమ్ తేజ్ 

Madhapur DCP: ఓవర్ స్పీడ్, ఇసుక ఉండటంతో ప్రమాదం జరిగిందన్నారు మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వరరావు. రాయదుర్గం పీఎస్‌లో సాయిధరమ్ తేజ్‌పై కేసు నమోదు చేశామన్న ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడనే విషయాలు ఇంకా తెలియదన్నారు. సాయిధరమ్ తేజ్ కోలుకున్న తర్వాత మరిన్ని వివరాలు సేకరిస్తామన్నారు.

కేబుల్ బ్రిడ్జ్ పై 35 నుండి 40కి మించి స్పీడ్ వెళ్లకూడదని సూచించారు. ఎక్కువ స్పీడ్‌తో సాయిధరమ్ తేజ్ డ్రైవ్ చేశాడన్న మాదాపూర్ డీసీపీ.. లెఫ్ట్ సైడ్ నుండి ఓవర్ టేక్ చేయడం ట్రాఫిక్ రూల్స్ కి విరుద్ధమని కానీ సాయి ధరమ్ తేజ్ లెఫ్ట్ సైడ్ నుండి ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించాడన్నారు.

Tags:    

Similar News