సునిశిత్‌పై లావణ్య త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు

Update: 2020-03-17 11:39 GMT

నటి లావణ్య త్రిపాఠి హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. తనపై అసత్య ప్రచారం చేస్తున్న ఓ వ్యక్తిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు మెయిల్‌ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. సునిశిత్‌ అనే వ్యక్తిని తాను పెళ్లి చేసుకున్నట్టు అబద్ధపు ప్రచారం చేస్తున్నాడని లావణ్య త్రిపాఠి ఆరోపించారు. తన పట్ల వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆమె పోలీసులను కోరారు. కాగా, సునిశిత్‌ పలు యూట్యూబ్‌ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో లావణ్యపై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాను, లావణ్య త్రిపాఠి పెళ్లి చేసుకున్నామని, ఆమె తన భార్య అని చెప్పుకున్నాడు. కాకపోతే తాము ప్రస్తుతం విడిపోయి ఉన్నామని అన్నాడు. మా ఇద్దరిది సీక్రెట్ మ్యారేజ్. ఓ గుడిలో పెళ్లి చేసుకున్నాం. మా పెళ్లి ఫోటోలు కూడా తీశారు. కాకపోతే మేమిద్దరం విడిపోవడం వల్ల ప్రస్తుతం ఆ ఫోటోలు లేవు అని చెప్పాడు.

లావణ్య త్రిపాఠి ఫిర్యాదుపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌ మాట్లాడుతూ.. యూట్యూబ్‌ ఛానెల్స్‌లో సునిశిత్‌ చేసిన వ్యాఖ్యలను పరిశీలించామని తెలిపారు. ఆడవారిపై అసభ్యంగా మాట్లాడితే జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. సునిశిత్‌ ఇతర సెలబ్రిటీలపైన కూడా వ్యాఖ్యలు చేశారని అయితే ఇప్పటివరకు లావణ్య మాత్రమే ఫిర్యాదు చేశారని, ఆమె కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.  

Tags:    

Similar News