టార్చ్ బేరర్ ఈ పదం ఎక్కడో విన్నట్లు అనిపిస్తుందా? ఒక్క సారి పూర్తిగా చదవి గుర్తు చేసుకోండి. ప్రతి ముప్పై సంవత్సరాలకి బతుకు తాలూకా ఆలోచన మారుతూ ఉంటుంది. సినిమా వాళ్లు దాన్ని ట్రెండ్ అంటారు.. వ్యాపార వేత్తలు ఫ్యాషన్ అంటారు.. రాజకీయ నాయకులు తరం అంటారు.. మామూలు జనం జనరేషన్ అంటారు.. కాని ప్రతి జనరేషన్లోనూ ఓ కొత్త థాట్ని ముందుకు తీసుకువెళ్లే వాడు మాత్రం ఒక్కడే వస్తాడు.. వాడే టార్చ్ బేరర్ అంటారు.. వెళ్తున్నాడు చూశావా? బాలిరెడ్డీ వాడే టార్చ్ బేరర్. ఎన్టీఆర్ నటించిన చిత్రం 'అరవింద సమేత వీరరాఘవ' లో అద్భుతమైన డౌలాగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసుకుంది. అయితే తాజాగా వీరి కలయికలో మరో సినిమా ఖరారైంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక-హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ, నటుడు కల్యాణ్రామ్ నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్ఆర్ఆర్'లో బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలో ఆయన కొమరం భీంగా కనిపించనున్నారు. ఎన్టీఆర్ జోడిగా ఓలివియా మోరిస్ నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తియిన తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తారు. 2021 మే నెలలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 'అయినను పోయిరావలె హస్తినకు' ఈ సినిమాకు పెట్టినట్లుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అలవైకుంఠపురంలో ఇచ్చిన సక్సెస్ ను త్రివిక్రమ్ ఎంజాయ్ చేస్తు్న్నారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చే సినిమా అంటే భారీ అంచనాలు నెలకొన్నాయి.
#NTR30 pic.twitter.com/AZ3LEulpjN
— NTR Arts (@NTRArtsOfficial) February 19, 2020