"ఆది పురుష్" విషయంలో ఇంకా నిరాశగానే ఉన్న అభిమానులు

* విడుదల తేదీ కాదు ట్రైలర్ కావాలి అంటున్న ప్రభాస్ ఫ్యాన్స్

Update: 2023-01-19 02:34 GMT

"ఆది పురుష్" విషయంలో ఇంకా నిరాశగానే ఉన్న అభిమానులు

Adipurush: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకులు ముందుకు రాబోతున్న సినిమా "ఆది పురుష్". రామాయణం ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలాగా ఎదురుచూస్తున్నారు. భారీ అంచనాల మధ్య సినిమా టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం.

అప్పటిదాకా ఈ సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తారు కానీ ఈ టీజర్ విడుదలైన తర్వాత మాత్రం పరిస్థితులు ఒకసారి మారిపోయాయి. సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ చాలా చెత్తగా ఉన్నాయని దీనికంటే కార్టూన్లు బాగుంటాయని చాలామంది నెగటివ్ కామెంట్లు చేయటం మొదలుపెట్టారు. రావణాసురుడు పాత్ర పోషిస్తున్న సైఫ్ అలీ ఖాన్ ను కూడా ఒక ముస్లిం లాగా చూపించటం ఏమాత్రం బాగాలేదని చాలామంది ఈ సినిమాపై వేలెత్తి చూపించారు. దీంతో సినిమా విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో రివర్క్ మొదలుపెట్టింది చిత్ర బృందం.

ఈ నేపథ్యంలో జనవరిలో విడుదల కావాల్సిన ఈ సినిమాని వాయిదా వేసింది. తాజాగా ఈ సినిమా జూన్ 16న విడుదలవుతుంది అని అధికారికంగా ప్రకటించింది చిత్రం బృందం. #150డేస్ టు గో అనే ఒక హ్యాష్ ట్యాగ్ ను కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ చేయడానికి ప్రయత్నించింది. కానీ అభిమానులు మాత్రం "ఆది పురుష్" విషయంలో ఇంకా నిరాశగానే ఉన్నట్లు తెలుస్తోంది. చిత్ర విడుదల తేదీ కంటే ముందు టీజర్ లేదా ట్రైలర్ విడుదల చేస్తే బాగుంటుందని అవి చూసేదాకా ప్రేక్షకులకు సినిమాపై నమ్మకం కలగదని కొందరు చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఏం నిర్ణయించుకుంటుందో వేచి చూడాలి.

Tags:    

Similar News