Tollywood Drugs Case: కొనసాగుతున్న తనీష్ ఈడీ విచారణ

Tollywood Drugs Case: *మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ ఉల్లంఘన *కెల్విన్ సంబంధాలు, ఆర్థిక లావాదేవీలపై ఆరా

Update: 2021-09-17 06:15 GMT

కొనసాగుతున్న తనీష్ ఈడీ విచారణ

Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ కొనసాగుతుంది. హీరో తనీష్ ఈడీ విచారణకు హాజరయ్యారు. మనీలాండరింగ్, ఫెమా యాక్ట్ ఉల్లంఘనపై తనీష్‌ను ఈడీ ప్రశ్నించనుంది. డ్రగ్ డీలర్ కెల్విన్‌తో ఉన్న సంబంధాలపై కూడా ఆరా తీయనున్నారు.. అంతేకాకుండా.. ఎఫ్ క్లబ్‌తో ఉన్న పరిచయాలపై కూడా అధికారులు ప్రశ్నించనున్నారు. ఇప్పటికే తనీష్‌కు నోటీసులు జారీ చేసిన ఈడీ బ్యాంకు ఖాతాలను వెంట తేవాలని పేర్కొంది.

కెల్విన్ సమక్షంలో తనీష్‌ను సుదీర్ఘంగా విచారించనున్నారు. గతంలో 2017లో తనీష్ ఎక్సైజ్ విచారణను సైతం ఎదర్కొన్నారు. ఆ కేసు ఆదారంగా ఇప్పుడు మరోసారి ఈడీ విచారణ జరుపుతోంది. ఈకేసులో ఇప్పటికే 10 మంది సినిమా ప్రముఖులను ఈడీ విచారించింది.

Tags:    

Similar News