టాలీవుడ్ వర్సెస్ బాలీవుడ్.. హైదరాబాద్ వేదికగా సినీ స్టార్స్ క్రికెట్ మ్యాచ్..
Crescent Cricket Cup: పెరిగిపోతున్న డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా క్రెసెంట్ క్రికెట్ కప్ అనే ప్రోగ్రామ్ని టాలీవుడ్, బాలీవుడ్ తారలు కలిసి చేస్తున్నారు.
Crescent Cricket Cup: పెరిగిపోతున్న డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా క్రెసెంట్ క్రికెట్ కప్ అనే ప్రోగ్రామ్ని టాలీవుడ్, బాలీవుడ్ తారలు కలిసి చేస్తున్నారు. దీంతో టాలీవుడ్, బాలీవుడ్ యాక్టర్స్ కలిసి క్రికెట్ మ్యాచ్ ఆడుతూ 'సే నో డ్రగ్స్' అనే అవేరేనెస్ క్యాంపెయిన్ చేయడానికి సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 26న ఎల్బీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. కాగా ఈ క్రికెట్ కప్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రులు మహ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజ, టాలీవుడ్ హీరోలు హాజరయ్యారు. సినీ నటుల మధ్య క్రికెట్ జరగడం సంతోషకరమన్నారు మంత్రి తలసాని. డ్రగ్స్ నివారణకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు.