Chiranjeevi: బయోపిక్ కి నో చెప్పిన చిరంజీవి

Chiranjeevi: చిరంజీవి వదులుకున్న బయోపిక్ ను చేస్తున్న రవితేజ

Update: 2022-04-05 09:30 GMT

Chiranjeevi: బయోపిక్ కి నో చెప్పిన చిరంజీవి

Chiranjeevi: ఈ మధ్యకాలంలో బయోపిక్ ల హవా బాగానే నడుస్తోంది. స్టార్ హీరోల నుంచి డైరెక్టర్ల వరకు అందరూ బయోపిక్స్ చేయడంపై బాగానే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా "సైరా నరసింహారెడ్డి" అనే బయోపిక్ ని తీశారు. అయితే ఆ సినిమా తర్వాత చిరంజీవి కి బయోపిక్ చేసే అవకాశం వచ్చిందట.

గజదొంగ టైగర్ నాగేశ్వరరావు పై రావాల్సిన బయోపిక్ కూడా ముందుగా చిరంజీవి వద్దకే వెళ్లిందట కానీ చిరంజీవి ఆ సినిమాని చేయలేకపోయారట. దీంతో ఈ సినిమా మాస్ మహారాజా రవితేజ చేతిలోకి వెళ్ళింది."దొంగాట" మరియు "కిట్టు ఉన్నాడు జాగ్రత్త" ఫేమ్ వంశీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మధ్యనే ఈ సినిమాని దర్శకనిర్మాతలు గ్రాండ్ గా లాంచ్ కూడా చేశారు.

మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ వేడుకలో మాట్లాడుతూ దర్శకుడు వంశీ ముందుగా ఈ కథతో చిరంజీవి నే సంప్రదించినట్లు తెలిపారు. కానీ ఇతర సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి ఈ సినిమా చేయలేకపోవడంతో రవితేజ సంప్రదించగా రవితేజ ఒప్పుకున్నట్లు చెప్పారు. అదే వేడుకలో మాట్లాడుతూ చిరంజీవి తాను చేయలేకపోయినా సినిమాని తన తమ్ముడు రవి తేజ చేయటం తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.

Tags:    

Similar News