Balakrishna: ఓటీటీల గురించి ఈ షాకింగ్ కామెంట్లు చేసిన బాలకృష్ణ

Balakrishna: సినిమాలకి అదే బిగ్గెస్ట్ కాంపిటీషన్ అంటున్న బాలయ్య

Update: 2022-12-19 05:04 GMT

Balakrishna: ఓటీటీల గురించి ఈ షాకింగ్ కామెంట్లు చేసిన బాలకృష్ణ 

Balakrishna: సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ తాజాగా ఇప్పుడు "వీరసింహారెడ్డి" సినిమాతో బిజీగా ఉన్నారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఆఖరి స్టేజ్ లో ఉంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలకృష్ణ థియేటర్ల గురించి మరియు ఓటీటీల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.

ఈ మధ్యకాలంలో సినిమాకి ఓటీటీ చాలా పెద్ద కాంపిటీషన్ గా మారిందని థియేటర్లకు ప్రేక్షకులు రిపీట్ గా రావడాన్ని ఓటీటీ పూర్తిగా ఆపేసిందని అన్నారు బాలకృష్ణ. ఇప్పుడు థియేటర్లోకి ఎంతమంది వచ్చి సినిమాను చూస్తారు అనేది ప్రశ్నార్ధకంగా మారిందని సినిమాలకి ఓటీటీ పెద్ద కాంపిటీషన్ గా తయారైందని అందుకే మంచి సినిమాలు తీయాలని అన్నారు బాలయ్య.

అంతేకాకుండా టికెట్ రేట్లను కూడా ప్రేక్షకులు కొనగలిగే విధంగా ఉండాలని, పైగా థియేటర్లలో సినిమా చూడటం వల్ల ఉండే ఎంజాయ్మెంట్ వేరుగా ఉంటుందని అప్పుడు కచ్చితంగా ప్రేక్షకులు థియేటర్లకు వస్తారని అన్నారు బాలకృష్ణ. తెలుగు సినిమా ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళింది అని దానిని చూసి మనందరం ఇన్స్పైర్ అవ్వాలని అన్నారు. ఇక ఈ మధ్యనే ఏషియన్ వారితో చేతులు కలిపిన బాలకృష్ణ ఏసియన్ తారకరామా కాంప్లెక్స్ ని గ్రాండ్ గా రీ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News