Arijit Singh retirement: సంగీత ప్రేమికులకు షాక్.. సినిమా పాటలకు అరిజిత్ సింగ్ గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఎమోషనల్ పోస్ట్!
Arijit Singh retirement: సంగీత ప్రపంచంలో సంచలనం.. ప్లేబ్యాక్ సింగింగ్కు గుడ్ బై చెప్పిన అరిజిత్ సింగ్. "నేను ముగింపు పలుకుతున్నాను" అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ పోస్ట్. సినిమా పాటలకు స్వస్తి పలికిన పద్మశ్రీ అవార్డు గ్రహీత.
Arijit Singh retirement: సంగీత ప్రేమికులకు షాక్.. సినిమా పాటలకు అరిజిత్ సింగ్ గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటిస్తూ ఎమోషనల్ పోస్ట్!
Arijit Singh retirement: తన గాత్రంతో దశాబ్ద కాలానికి పైగా దేశాన్ని ఊగించిన బాలీవుడ్ గాయకుడు అరిజిత్ సింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కెరీర్ అత్యున్నత శిఖరాల్లో ఉన్న సమయంలోనే ఆయన సినిమా పాటలకు (Playback Singing) స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో "నేను ముగింపు పలుకుతున్నాను" (I am calling it off) అని పోస్ట్ చేస్తూ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేశారు.
అరిజిత్ సింగ్ ఎమోషనల్ పోస్ట్:
"గడిచిన ఇన్నేళ్లుగా శ్రోతలుగా మీరు నాపై చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు. ఇకపై ప్లేబ్యాక్ సింగర్గా నేను ఎలాంటి కొత్త ప్రాజెక్టులు తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా సాగింది. దేవుడు నాపై ఎంతో కరుణ చూపాడు" అని అరిజిత్ రాసుకొచ్చారు. అయితే సినిమాల్లో పాడటం మానేసినా, సంగీతానికి దూరం కావడం లేదని ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఒక చిన్న కళాకారుడిగా స్వతంత్ర సంగీతం (Independent Music) రూపొందిస్తానని వెల్లడించారు.
టాలీవుడ్లోనూ చెరగని ముద్ర: హిందీలోనే కాకుండా తెలుగులోనూ అరిజిత్ తనదైన ముద్ర వేశారు.
మనం: కనులను తాకే ఓ కల
స్వామి రారా: అదేంటి ఒక్కసారి
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా: మాయా వంటి పాటలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. బెంగాలీ, తమిళం, మలయాళం సహా పలు భాషల్లో వేలాది పాటలు పాడిన ఆయన కృషికి గానూ కేంద్ర ప్రభుత్వం గతేడాది 'పద్మశ్రీ' అవార్డుతో గౌరవించింది.
పెండింగ్ ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? అరిజిత్ సింగ్ ప్రస్తుతం ఒప్పుకున్న కొన్ని ప్రాజెక్టులు పూర్తి కావాల్సి ఉంది. కాబట్టి ఈ ఏడాది ఆయన పాడిన చివరి పాటలు విడుదలయ్యే అవకాశం ఉంది. అవి పూర్తయిన తర్వాత ఆయన పూర్తిగా వెండితెరకు దూరమై, వ్యక్తిగత సంగీత ప్రయాణంపై దృష్టి సారించనున్నారు. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే గాయకుడు ఇలా అకస్మాత్తుగా తప్పుకోవడం సినీ పరిశ్రమలో పెద్ద చర్చకు దారితీసింది.