స్టార్ హీరో మూవీలో విలన్‌గా అనసూయా ?

అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉన్నారంటే ఆశ్చర్యమే.

Update: 2020-02-18 14:28 GMT
Anasuya File Photo

అనసూయ.. ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు ఉన్నారంటే ఆశ్చర్యమే. ఎందుకంటే అనసూయ అంతలా బుల్లితెరపై అంతలా పాపులర్ అయింది. జబర్దస్త్‌ షోతో స్టార్ యాంకర్‌గా పేరు తెచ్చుకున్న అససూన పలు సినిమాల్లో కూడా నటించింది. క్షణం, సుకుమార్‌, రాంచరణ్‌ కాంబినేషన్‌లో రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా పాత్రలు చేసి తన ఫర్మామెన్స్ లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. రంగమ్మత్త పాత్రకు ఎన్నో అవార్డులు కూడా ఆమెను వరించాయి. ఆ తర్వాత నుంచి ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

కాగా.. బుల్లి తెరపై పలు షోలులో అందాలు ఆరబోస్తూ, తన వ్యాఖ్యానంలో ప్రేక్షకులను అల్లరిస్తూనే.. అడపడపా ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తు వస్తోంది. హీరో విజయ్ దేవరకొండ నిర్మించిన 'మీకుమాత్రమే చెప్తా'లో కీలకపాత్ర పోషించింది. ఈ ఏడాది కూడా పలు చిత్రాల్లో అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం అల వైకుంఠపురములో.. విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న అల్లు అర్జున్‌ త్వరలో సుకుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. అల్లు అర్జున్ సినిమాతోపాటు, పవన్‌ కల్యాణ్‌-క్రిష్‌ తీయబోతున్న సినిమాలోనూ ఈ యంకరమ్మకు అవకాశాలు వచ్చాయి. ఈ సినిమాలో కీలక పాత్ర చేస్తున్న అనసూయకు మరో ఆఫర్ వచ్చిందని టాక్. తాజాగా ఓ స్టార్ హీరో మూవీలో అనసూయ కీలక పాత్రలో కనిపించనుందని టాక్.

ఓ స్టార్ హీరో మూవీలో విలన్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారని సమాచారం. విజయ్ దేవరకొండ నిర్మించనున్న ఓ సినిమాలో అనసూయకు అవకాశం వచ్చినట్లు టాలీవుడ్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ సినిమాలో అనసూయ విలన్ గా నటిస్తోందట. దీనిపై త్వరలో స్పష్టత రానుంది. అయితే విలన్ గా ఎలా మెప్పిస్తుందో చూడాలి. క్షణం చిత్రంలో పూర్తి స్థాయిలో కాకుండా ప్రతినాయిక ఛాయలున్న పాత్ర చేసిన సంగతి తెలిసిందే.  

Tags:    

Similar News