షారుఖ్ ఖాన్ సినిమా నుంచి తప్పుకున్న అమిత్ రాయి

*రాజ్ కుమార్ హిరానీ తో విభేదాల వల్ల షారుఖ్ ఖాన్ సినిమా నుంచి తప్పుకున్న డిఓపి

Update: 2022-07-14 09:00 GMT

షారుఖ్ ఖాన్ సినిమా నుంచి తప్పుకున్న అమిత్ రాయి

Amit Rai: కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ తాజాగా ఇప్పుడు మళ్లీ వెండి తెరపై కనిపించబోతున్న సంగతి తెలిసింది. 2018 లో జీరో సినిమాలో కనిపించిన షారుక్ మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వెండితెరపై కనిపించనున్నారు. అప్పటికే కొన్ని సినిమాలు సైన్ చేసిన షారుఖ్ ఖాన్ రాజకుమార్ హిరానీ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా కి "డుంకి" అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు దర్శక నిర్మాతలు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా కాబట్టి ప్రేక్షకులకు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలెంటెడ్ బ్యూటీ తాప్సీ పన్ను ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది.

అయితే తాజాగా దర్శకుడితో టెక్నికల్ విషయాల్లో కొన్ని విభేదాలు రావడంతో ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పని చేయాల్సిన అమిత్ రాయ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూలో రాజ్ కుమార్ హీరాని ఈ విషయం గురించి క్లారిటీ ఇచ్చారు. స్నేహపూర్వకంగానే ప్రాజెక్టు నుంచి చిత్ర డిఓపి తప్పుకున్నట్లుగా తెలిపారు. సినిమా కోసం 20 రోజులు పని చేశారని ఇప్పటికే సినిమా మొదటి షెడ్యూల్ కూడా పూర్తయిందని క్లారిటీ ఇచ్చారు. బొమన్ ఇరానీ ఈ సినిమాలో ముఖ్యపాత్రలో కనిపించనున్నారు.

Tags:    

Similar News