స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ 'అల.. వైకుంఠపురములో' చిత్రానికి మరో అరుదైన రికార్డు వచ్చి చేరింది. ఈ ఘనత సాధించి తొలి తెలుగు హీరోగా బన్నీ నిలిచాడు. అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన చిత్రం 'అల.. వైకుంఠపురములో'.. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలైన ఈ సినీమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు వసూళ్ల పరంగానూ సునామీ సృష్టించింది. జులాయి', 'సన్నాఫ్ సత్యమూర్తి' 'అల.. వైకుంఠపురములో'. హ్యాట్రిక్ విజయాన్ని అందించింది. అల.. వైకుంఠపురములో' సినిమా తర్వాత అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్తో ఓ చిత్రం చేయబోతున్నాడు. ఇందులో బన్నీ మాస్ లుక్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
తాజాగా ప్రఖ్యాత మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్లో పాన్ ఇండియా స్థాయిలో `అల వైకుంఠపురములో` చిత్ర పాటలకు టాప్ ప్లేస్లో ట్రెండ్ అవుతున్నాయని ఆదిత్య మూజిక్ వెల్లడించారు. ఇంతటి సూపర్ హిట్ ఆల్బమ్ తమ సంస్థ ద్వారా విడుదల చేసే సువర్ణ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆదిత్య మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్త చిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపారు. గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని, సంగీత దర్శకుడు తమన్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్ర గీతాలు ఇప్పకీ అమెజాన్ ప్రైమ్ , జియో సావన్ మ్యూజిక్ వంటి ప్లాట్ ఫామ్స్లో టాప్ ప్లేస్ లో కొనసాగడం విశేషం.
అలవైకుంఠపురములో.. సినిమా కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన ` సామజ వరగమన..`. కాసర్ల శ్యామ్ అందించిన `రాములో రాముల..` పాటలకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఈ రెండు పాటలు యూట్యూబ్లో వంద మిలియన్ వ్యూస్ దాటి ఓ రికార్డుగా నిలిచాయి. . ఇటీవలే 'అల.. వైకుంఠపురములో' ఓటీటీ ఫ్లాట్ఫాం నెట్ఫ్లిక్స్లో విడుదలైంది. ఇండియాలోనే టాప్ టెన్ మూవీస్ లిస్టులో విడుదలైన మొదటి రోజే చోటు సంపాదించింది. ఈ చిత్రం రెండు రోజులకే నెంబర్ వన్ ప్లేస్ను చేరుకుంది. ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా కూడా చేరుకోలేదు.