Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన నటి చార్మీ

Tollywood Drugs Case: టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుపై ఈడీ విచారణ

Update: 2021-09-02 05:15 GMT
డ్రగ్స్ కేసు విచారణంకు హాజరు అయిన ఛార్మి (ఫైల్ ఇమేజ్)

Tollywood Drugs Case: టాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసు విచారణకు నటి, నిర్మాత ఛార్మి హాజరయ్యారు. ఈ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద టాలీవుడ్ సెలబ్రిటీస్‌‌ 12 మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఆగస్టు 31న దర్శకుడు పూరీ జగన్నాథ్‌ను కీలక విషయాలపై 10 గంటలపాటు ఈడీ విచారించింది. ఈ క్రమంలోనే కాసేపటి క్రితం ఛార్మీ హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆమె బ్యాంక్‌ ఖాతాలను పరిశీలించనున్నారు. ఆమె వ్యక్తిగత, ప్రొడెక్షన్‌ హౌస్‌కు సంబంధించిన లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నట్లు సమాచారం.

Full View


Tags:    

Similar News