Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్చరణ్ దంపతులు
Tirumala: వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న రాంచరణ్ దంపతులు
Tirumala: తిరుమల శ్రీవారిని సినీ నటుడు రాంచరణ్ దంపతులు దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా రాంచరణ్...తన కూతురు క్లీంకారా, భార్య ఉపాసన మరికొందరు కుటుంబసభ్యులతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో రాంచరణ్ దంపతులకు పండితులు వేదాశీర్వచనం చేయగా, అధికారులు తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనాంతరం ఆలయం వెలుపలకు వచ్చిన రాంచరణ్ను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు.